ఈ బ్లాగును సెర్చ్ చేయండి

24, మే 2010, సోమవారం

హిందూ-ముస్లిం భాయీ భాయి



* "ప్రస్థాన త్రయం అంటే "భగవద్గీత ,ఉపనిషత్తులు ,బ్రహ్మ సూత్రాలు " . అంతే కాదు " భగవద్గీత ,బైబిల్ ,ఖురాను కూడా" --వివేకానందుడు

* షహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ (https://www.facebook.com/photo.php?fbid=457730137592315&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater&notif_t=like), నేపధ్య గాయకుడు మొహమ్మద్ రఫీ ,సంగీత దర్శకుడు నౌషాద్ ఎన్నో హిందూ భక్తి గీతాలతో దేశప్రజలను అలరించారు.
*అలీఖాన్ అనే హిందూస్థానీ సితార్ పండిట్ రుద్రాక్షలు వేసుకుని, తిలకం పెట్టుకుని యు ట్యూబ్లో బాహాటంగా తన హిందూ విశ్వాసాలపై గౌరవం చాటుకున్నాడు.
* మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అన్ని మతాల వారి ఆదరణను పొందారు.
* తమిళ నాడులోని శ్రీరంగం దేవాలయం, భద్రాచలం రాముల వారి దేవాలయంలో సన్నాయి వాయించేది తెలుగు ముస్లింలే.షేక్ చినమౌలానా సుబ్రహ్మణ్యస్వామి భక్తుడు.శ్రీరంగం దేవస్థానంలో స్వర్గీయ షేక్ చినమౌలానా నాదస్వర సేవ చేశాడు.ఆయన మనమడు నేటికీ సేవిస్తున్నాడు.
* నాగూర్ బాబు (మనో) కుటుంబం రంజాన్‌ని ఎంత ఘనంగా చేసుకుంటారో దీపావళి, క్రిస్‌మస్‌లను కూడా అంతే గొప్పగా జరుపుకొంటారు.భార్య జమీలా తో కలిసి ప్రతి ఏటా తిరుమలకు కాలినడకన వెళతారు. శబరిమలైకి వెళ్లి అయప్పస్వామిని దర్శించుకుంటారు.(ఆగస్ట్ 8, 2010 ఈనాడు వసుంధర)
* అమర్‌నాధ్ బాబా గుడి కనిపెట్టింది ఒక ముస్లిం సోదరుడు.ఆ గుడి దగ్గర షాపుల్లో పూజా సామాగ్రి ముస్లిం సోదరులు కూడా అమ్ముతారు.
* కేరళలోని మాతా అమృతానందమాయి దేశంలో పలుచోట్ల నిర్మించిన ఆలయాల వాస్తుశిల్పి ముస్లిం.
* భద్రాచలంలోని రాములవారి కల్యాణానికి ముత్యాలు నిజాం వంశీయుల నుండి వచ్చేవి.
*మెహర్ బాబా ఆత్మజ్నానాన్ని హజరత్ బాబాజాన్ అనే సద్గురు దగ్గర పొందారు.పూనే లోని ఆమె దర్గాకు హిందూ ముస్లిం ప్రజలందరూ ఈనాటికీ వెళుతున్నారు.http://en.wikipedia.org/wiki/Hazrat_Babajan
* బీబీ నాంచారమ్మ (వేంకటేశ్వరుని రెండవ భార్య)ముస్లిం స్త్రీ.తిరుమలలో ఆమె దేవాలయం ఉంది.ప్రతి మంగళవారం తిరుమలలో మూలవిరాట్టుకు గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ మరియు హైదరాబాదుకు చెందిన సయ్యద్ మీర్జా అనే ముస్లిములు సమర్పించిన 108 బంగారు పుష్పాలతో బాలాజీ 108 నామాలు ఉచ్చరిస్తూ "స్వర్ణ పుష్పార్చన" లేదా "అష్టదళ పాద పద్మారాధన" చేస్తారు. ఉత్సవదేవతలైన శ్రీదేవి, భూదేవిలకు సయ్యద్ మీర్జా సమర్పించిన రెండు మంగళసూత్రాలనే నేటికీ వేంకటేశ్వర కళ్యాణోత్సవంలో ఉపయోగిస్తున్నారు.ఆనాటి బ్రిటీష్ అధికారి సర్ థామస్ మన్రో సమర్పించిన మన్రో గంగాళం లోనే నేటికీ నైవేద్యం తెస్తున్నారు.(http://ravindrasriramanujadasan.co.cc/tirumala/impq/tfaq13.html),సాక్షి ఆదివారం అనుబందం 25.9.2011
*మంగళూరులో హజరత్ సైదానీ బీబీ సాహిబా అనే సన్యాసిని దర్గాకు ఇరుమతాలవారూ ఇప్పటికీ భక్తితో వెళుతున్నారు.(డెక్కన్ హెరాల్డ్ 9.9.2013)http://www.deccanherald.com/content/350426/woman-saint039s-dargah-centre-communal.html
*మెదక్‌ జిల్లా ముత్తంగి గ్రామంలోని పిఈఎస్‌కాలనీలో వినాయక విగ్రహం వద్ద నిర్వహించిన వేలంలో ఓ ముస్లిం యువకుడు యూనస్‌ రూ24,600కి లడ్డూను చేజిక్కించుకున్నారు. లడ్డూను అందరికీ పంచిపెడితే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వేలంలో పాల్గొన్నట్లు యూనస్‌ తెలిపారు.ఈనాడు12.9.2011
 * షిర్డీ శాయిబాబా ఒక మసీదులో నివసించాడు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించాడు. ఈయన రెండు సాంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించాడు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ (सबका मालिक एक) (అందరి ప్రభువు ఒక్కడే).ఆ మసీదు ( ద్వారకామాయి) లోనే శ్రీరామనవమి పండుగ జరిపేవాడు.రెండు మతాల గ్రంధాలనూ సాయిబాబా ఆదరించి వ్యాఖ్యానించాడు.
*
అన్ని మతాలూ వికసించాలి. భగవంతుని వైభవం అన్ని భాషలలోనూ గానం చేయబడాలి. అదే ఆదర్శవంతమైనది. వివిధ మతాల మధ్య భేదాలను గౌరవించండి. కాని ఐక్యత అనే జ్యోతిని ఆరిపోనీయవద్దు అన్నారు పుట్టపర్తి శాయిబాబా.
*
అక్బర్ చక్రవర్తి మీరా బాయి భజనలు వినడానికి వెళ్ళేవాడు.
*
శబరిమలై అయ్యప్ప కు వావర్ అనే ముస్లిం మిత్రుడున్నాడట.భక్తులు దగ్గరలోని వావర్ దర్గాకు కూడా వెళతారు.వావర్‌ స్వామి కోసం ప్రత్యేకంగా మిరియాల పొట్లం ఇరుముడి లో పెట్టుకొని తీసికెళతారు.


సాక్షి 10.12.2018
*
నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌లో అయ్యప్ప, షిరిడీ సాయి ఆలయాలకు స్థానిక ముస్లింలు తరలివస్తారు.భజనలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు.
*
పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ లో మీరాసాహెబ్ దుర్గా మాతకు గుడి కట్టి నిష్టతో పూజారిగా ఇప్పటికీ పనిచేస్తున్నాడు.
*
నిజామాబాద్‌ జిల్లాలోని భైంసాలో మతకల్లోలాలు జరిగినప్పుడు ఓ సాధారణ హిందూ వనిత తుల్జాబాయి దాడికిలోనైన కొందరు ముస్లింలకు ఆశ్రయం యిచ్చింది.
*
సికింద్రాబాద్‌ లోని టకార్‌ బస్తీవాసి షేక్‌ ఇమ్రానుద్దీన్‌,హనుమాన్‌ జయంతిని ఎంతో భక్తితో జరుపు కుంటాడు.
*
హైదరాబాద్‌లో బాలాజీ దేవాలయం సమీపంలోనే హనుమంతుని ఆలయం.స్థానికంగా ఓ ముస్లిం మరణిస్తే, గౌరవ సూచకంగా హనుమజ్జయంతిరోజున హనుమంతుని ఆలయాన్ని మూసివేశారు.
*
పాతబస్తీలోని గొల్లా ఖిడ్కీ కాలనిలో ఇతేషామ్‌ ఆలీఖాన్‌ స్థానిక ముస్లింలతో, హిందువులపై దాడిని వారించారు. సుబోధ్‌ కుమార్‌, తనహిందూ మిత్రులతో కలిసి హిందూ ఆందోళన కారులనుండి ముస్లిం సోదరులను కాపాడాడు.
*
బేగం బజారులోని మొహ్మద్‌ ఇస్మాయిల్‌ గత 25 సంవత్సరాలుగా తనదుకాణం 'హషీమ్‌ అండ్‌ సన్స్‌' తలుపులపై హిందువుల దేవతాచిత్రాల బొమ్మలకు అగరుబత్తీలు వెలిగిస్తున్నాడు.
*
ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ కడప పెద్ద దర్గాను దర్శించుకుని ప్రార్థనలు జరిపారు. దర్గాను దర్శించుకున్న తరువాతే తన పేరు గిన్నీస్ బుక్ లో చేరిందని,పెద్ద దర్గా మత సామరస్యానికి ప్రతీక అని గజల్ శ్రీనివాస్ అభివర్ణించారు.
*
విశ్వహిందూ పరిషత్‌ (విహెచ్‌పి) నిర్వహించిన భగవద్గీత శ్లోకాలపఠన పోటీల్లో తుంగతుర్తి మండలం అన్నారం ఉన్నత పాఠశాలలో చదివే ముగ్గురు ముస్లిం సోదరులు అలీమ్‌ (16) అజీమ్‌ (14), అజామ్‌ (13) లు రాష్ట్ర స్థాయిలో జరిగిన పలు పోటీల్లో పాల్గొని అనేక బహుమతులను దక్కించుకున్నారు.తెలుగు ఉపాధ్యాయుడు వి.కృష్ణమాచార్యులు కారణంగా ఆ సోదరులు ప్రస్తుతం 60 శ్లోకాలను సరియైన ఉచ్ఛారణతో పఠించటంతో పాటు వాటి తాత్పర్యాన్ని కూడా చెప్పగలుగుతున్నారు.
*
మహంకాళీ అమ్మవారి బోనాల పండుగలో హైదరాబాదు పాతబస్తీకి చెందిన ముస్లిములు కొందరు తమ భార్యలతో సహా భక్తి శ్రద్ధలతో పాల్గొనటం,తమకు అమ్మవారి దయవల్ల బిడ్డలు పుట్టారని చెప్పటం 8.8.2010న టీ.వీ చానెళ్ళు ప్రసారం చేశాయి.
*
హైదరాబాద్‌కి చెందిన 55 ఏళ్ళ షాహీన్‌ సల్తానా 1980లో మత కల్లోలాల్లో భయంకరమైన హింసని చూసిన ఆమె మత సామరస్యం కోసం కృషి చేస్తోంది.నవీన మహిళా కాంటెస్ట్‌ 2008 కి ఫైనలిస్ట్‌గా ఎంపికైంది.
*
కృష్ణా జిల్లా అడిషనల్ జాయింట్ కలెక్టర్ శంషీర్ అహ్మద్ షిర్డీ శాయిబాబా భజన కీర్తనలను స్వయంగా రాసి ప్రచురించి ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు.
*
లంగర్‌హౌజ్‌ గొల్లబస్తీలో హనుమాన్‌ జయంతి సందర్భంగా హిందువులు,ముస్లిములు అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు.(ప్రజాశక్తి31.3.2010)
*
చంద్రాయణగుట్ట లాల్‌దర్వాజాలో ఒక ముస్లిం యువకుడు వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నాడు. మతవిద్వేషాలుకాదు అన్నిమతాల సారం ఒక్కటే అని చెబుతున్నాడు.ఇదే తరహాలోఅమీర్‌పేట్‌కు చెందిన షఫీక్‌ చాంద్రాయణగుట్టలో ట్రేడ్‌ యూని యన్‌ నాయకుడిగా పనిచేసిన పాషా ప్రతి యేడు చాంద్రాయణగుట్ట చౌరస్తాలో వినాయక మండ పాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించాడు.(సూర్య 25.8.2009)
*
మంగళగిరి మిద్దె సెంటర్లో 19.2.1975న హిందూ ముస్లిములు కలిసి బాలగణపతి గుడి ప్రారంభించారు.ఇప్పటికీ షేక్ ఖాసిం సోదరులు హిందువులతో కలిసి నవరాత్రిఉత్సవాలు నిర్వహిస్తున్నారు.(సాక్షి మంగళగిరి 12.9.2010)
*
గుంటూరు కొత్తపేటలోని గణేశ్ వారి వీధిలో ముస్లిం యువకులు 5 ఏళ్ళుగా వినాయకుని విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు.ముస్లిం యువత ఏర్పాటు చేసిన వినాయకుడికి ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలి పూజలు చేశారు.(సాక్షి గుంటూరు12.9.2010)
*
ఔరంగాబాద్ లోని ఓ దర్గామసీదులో వినాయకచవితి వేడుకలు 35 సంవత్సరాలనుండి స్థానిక ముస్లిములు చేస్తున్నారు(జీ టీవీ వార్త17.9.2010)
*
పీర్ల పండుగకు బూంది, సాంబ్రాణి సమర్పించి, గుండంలోని బూడిదను నుదుట దిద్దుకునే హిందూ ప్రజలున్నారు. దీపావళి, దసరా వేడుకల్లో, క్రిస్మస్ వేడుకల్లో, ఈద్ విందుల్లో పాల్గొనే క్రైస్తవ,ముస్లిం ప్రజలున్నారు.చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో ఇప్పటికీ హిందూ ముస్లిములిద్దరూ కలిసి దసరా రంజాన్ పండుగలు జరుపుకుంటున్నారు (హిందూ 20.11.2001)
*
కాశ్మీర్‌లో పండిట్ల గ్రామాల్లో ముస్లింలే హిందువులకు దేవాలయాలను నిర్మించారు. కాశ్మీరీ పండిట్లంతా ఏటేటా జరిగే హజరత్ సయీద్ అక్బరుద్ దిన్ ఉర్సు వేడుకల్లో అత్యంత ఉత్సాహంతో పాల్గొంటారు. సొంత వేడుకగానే జరుపుకునేవారు.ఉర్సులలో హిందువులు పాలుపంచుకోవడం పరిపాటే.
కాశ్మీర్‌లో పుల్వామా గ్రామంలో నేటికీ హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఒకే ముస్లిం పవిత్ర స్థలంలో ఒకపక్క హోమం, మరో పక్క నమాజు చేస్తారు.
*
గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో ఉన్న పిరానా గ్రామంలోని 600 ఏళ్ల నాటి ఇమామ్ దర్గాలో హిందూ ముస్లింలు కలిసి ప్రార్థనలు చేస్తారు.
*
ఉత్తరప్రదేశ్‌లో దుసావా కాలా గ్రామంలోని ముస్లింలు తమ మతస్తుల సమాధులను పంచాయితీ కేటాయించిన మరో స్థలంలోకి మార్చేపని చేపట్టారు. ఆ తవ్వకం పనుల్లో రాతి శివలింగం, నంది బయటపడ్డాయి. వెంటనే గ్రామ పెద్దలంతా సమావేశమై లింగం, నంది లభించిన స్థలంలో శివాల యం కట్టుకోవాలని, మిగతా స్థలాన్ని ముస్లింలు ఉపయోగించుకోవాలని నిర్ణయించారు.సాక్షి 22.9.2010
*
హైదరాబాద్‌లో జరిగే వినాయక ఉత్సవాలు సర్వమత సమ్మేళనానికి నిదర్శనంగా నిలుస్తాయని నిరూపించారు జఫరుల్లాఖాన్. వేలంలో లక్షా రెండు వేలకు గణపతి లడ్డూను సొంతం చేసుకుని ఆయన మత సామరస్యాన్ని చాటారు. కొండాపూర్‌లోని శ్రీరాంనగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో శ్రీరాంనగర్-బి, సి బ్లాక్‌ల అధ్యక్షుడైన జఫరుల్లాఖాన్ పది మందితో పోటీపడి మరీ లడ్డూను దక్కించుకున్నారు. ఏటా వినాయక చవితి, శ్రీరామనవమి ఉత్సవాలను కాలనీ వాసులంతా కలిసి నిర్వహిస్తామని ,ఏటా తన సమక్షంలో వేలం పాట జరిగేదని, ఈసారి తానే లడ్డూను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.సాక్షి 23.9.2010
*
అయోధ్యలోని హనుమాన్ గర్హి ప్రాంతంలో కొలువైన సత్యార్సర్వమత ప్రార్థనాలయం.అక్కడ ఓ వైపు రాముడు, మరోవైపు గౌతమ బుద్ధుడు, ఇంకోవైపు మహావీరుడు, ఓ చోట మక్కా-మదీనా చిత్రపటం, ఇంకో చోట క్రిస్ట్రియన్ మత చిహ్నాలు ఇలా.. అన్ని మతాలకు చెందిన పండుగలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. గుజరాత్‌కు చెందిన పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త లాల్జీబాయ్ సత్య సనేహి 60 ఏళ్ల క్రితం ఈ ప్రార్థనాలయాన్ని నిర్మించారు.ఈ ఆలయంలోకి వచ్చిన వారు తమ మతానికి చెందిన దేవుడిని పూజించిన అనంతరం .. పక్కనే ఉన్న ఇతర మతాలకు చెందిన దేవుళ్లను ప్రార్థిస్తారు.సాక్షి 26.9.2010
*"
నేను ముస్లిం మతానికి చెందిన కుటుంబంలో పుట్టినా,ఊహ తెలిసిన తర్వాత క్రైస్తవాన్ని పుచ్చుకున్నాను.మా అమ్మ గొప్ప ఆధ్యాత్మికవాది.ఆమె నన్ను చర్చి వాతావరణంలో పెంచలేదు.క్రీస్తు బోధనలు నా భావి జీవితానికి మార్గాన్ని సుగమం చేశాయి. అందుకే క్రైస్తవాన్ని ఎంచుకున్నాను.నా పాపాలకు ప్రాయశ్చిత్తంగా క్రీస్తు శిలువపై చనిపోవడం,మానవులుగా మనందరిలో ఉండాల్సిన నమ్రతను గుర్తు చేసింది. మనందరం పాపులం. తప్పులు చేస్తాం. మనలోనే దోషాలు ఉన్నాయి. దేవుని ప్రేమతోనే అందరికీ విముక్తి లభిస్తుంది.నాకు పరమత ద్వేషంలేదు.మతనమ్మకం ఉన్నవాళ్లనూ, మతనమ్మకం లేనివాళ్లనూ ఈ ప్రపంచం సమానంగా ఆదరిస్తోంది.మన దగ్గర క్రైస్తవుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ ఇక్కడ యూదులు, ముస్లింలు, హిందువులు, నాస్తికులు, హేతువాదులు, బౌద్ధులు కూడా ఉన్నారు. విముక్తిపై మనకు నమ్మకం ఎలా ఉందో అలాగే వారికీ విశ్వాసాలు ఉన్నాయి. మన నమ్మకాన్ని ఎలా గౌరవిస్తామో వారి నమ్మకాలనూ అలాగే గౌరవించాలి".--- అమెరికా అధ్యక్షుడు బరాక్‌ హుసేన్ [[ఒబామా]] (ఈనాడు30.9.2010)
*
పంజాబ్‌లోని పాటియాలాలో ఉన్న చారిత్రక కాళీమాత ఆలయంలో ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.(సాక్షి 25.10.2010)
*
గుంటూరు జిల్లా మాచవరం మండలం జింకలపాలెం 25 ముస్లిం కుటుంబాలు సుమారు వందసంవత్సరాలనుండి ధ్వజస్థంభాల తయారుచేస్తున్నారు.ఆకురాజుపల్లె లో ఆంజనేయుడికి పూజలుచేశాక పని ప్రారంభిస్తారట.సాక్షి గుంటూరు 28.10.2010

*"
హిందూ, ముస్లింల సోదరభావానికి, ఐకమత్యానికి కావరియా యాత్ర ప్రతీక.కావరియాలు తీసుకొని హరిద్వార్‌కు యాత్ర నిర్వహించే భక్తులకు ముస్లిం వర్గాలు స్వాగతం పలికి సత్కరించడం సంతోషం"--షీలా దీక్షిత్‌
*
నడికుడి పంచాయతీ పరిధిలోని మన్షూర్షాపేట కు చెందిన షేక్ మస్తాన్‌బీ నేపాల్ నుంచి ఒక పంచముఖ రుద్రాక్ష మొక్కను తెప్పించి పెరట్లో నాటింది.ఆ చెట్టు నుంచి కాచిన పంచ ముఖ రుద్రాక్షలతో రోజూ తిరుపతమ్మ తల్లికి పూజలు చేస్తోంది.(సాక్షి 2.11.2010)

*ఇండోనేసియా ప్రపంచంలోకెల్లా పెద్ద ముస్లిం దేశం.అక్కడి నేషనల్ ఎయిర్‌లైన్ పేరు ‘గరుడ’ డొమెస్టిక్ ఎయిర్‌లైన్ పేరు ‘జటాయు’.
ఇండోనేసియన్ కరెన్సీ నోటుమీద గణేశుడి బొమ్మ!
రాజధాని జకార్తాలో ముఖ్యకూడలివద్ద అర్జునుడికి కృష్ణుడు రథం మీద గీతోపదేశం చేస్తున్న నిలువెత్తు ప్రతిమ!
*
బాల్యంలోనే ఇరాక్ నుండి వచ్చి చిత్తూరు జిల్లాలో యాచకురాలిగా వచ్చిన డబ్బుతో దర్గాలు,శివాలయం కట్టించిన స్త్రీకి "మస్తానమ్మ" అనే పేరుపెట్టుకొని అక్కడి జనం ఆదరిస్తున్నారు.స్టూడియో ఎన్. వార్త20.6.2011
*
ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలంలోని తురకపాలెం గ్రామంలో 600 ముస్లిం కుటుంబాలు, ఒకే ఒక్క హిందూ కుటుంబం ఉన్నాయి.ఆ ఒక్క హిందూ కుటుంబం కోసం ముస్లిములు రామాలయం నిర్మించారు.స్టూడియో ఎన్ 8.7.2011

*హైదరాబాదు పోలీస్ కమీషనర్ ఏ.కె.ఖాన్ టీ.వీ.9 వారు నిర్వహించిన మట్టి వినాయకుని పూజలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి మత సామరస్యాన్ని చాటారు.టీ.వి.9 వార్త 13.9.2011
*మంగళగిరి దగ్గర 'పుట్టతోట' లోని హిందువుల పాముపుట్ట,ముస్లిముల జెండా చెట్టు రెంటికీ కలిపి పూజలు చేస్తున్నారు.(ఈనాడు గుంటూరు 31.10.2011)
*
ప్రకాశం బ్యారేజి దిగువన సీతానగరం లోని పల్లె కారులు ప్రతి యేటా నాగుల మీరా జెండా పండుగ కృష్ణానదీ తీరంలో జరుపుతారు (ఈనాడు గుంటూరు 12.11.2011) (సాక్షి 30.11.2013)







 

*విశ్వ హిందూ పరిషత్,తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహింఛిన భగవద్గీత శ్లోక పఠన పోటీలలో ఖమ్మం జిల్లా ఏన్కూరుగురుకులం లో 10,6,తరగతులు ఛదువుతున్న షేక్ సాజిద్,షారుక్ బాబా లు పాల్గొని ప్రధమ బహుమతులు గెలిఛారు.సాజిద్ 64 శ్లోకాలను ఛెప్పేస్తాడు.(ఈనాడు2.12.2011)
*అనంతపురం జిల్లా నార్పల మండలం లోని గూగూడు గ్రామంలో కుళ్ళాయిస్వామి,ఆంజనేయస్వామి కి కలిపి ఒకే చోట సరిగెత్తు జరుగుతుంది.హిందూ ముస్లిమ్ భక్తులు ఇటు కుళ్ళాయి స్వామి పీర్లకు అటు ఆంజనేయస్వామికి మొక్కులు తీర్చుకుంటారు(సాక్షి 3.12.2011,11.11.2013)

*కర్నూలు జిల్లా కౌతాళం లోని ఖాదర్ లింగా స్వామి దర్గాలో అక్కడి బ్రాహ్మణులు ప్రతి ఉగాది రోజున పంచాంగ పఠనం నిర్వహిస్తున్నారు (ఈనాడు 21.12.2011)
*గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం పుల్లడిగుంటమలినేని పెరుమాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో ఎం.బి.ఏ.చదువుతున్న షేక్ జాన్ బాబు భగవద్గీత లోని పది ఆధ్యాయాలను అనర్గళంగా చెబుతూ అనేక బహుమతులు పొందాడు.(ఈనాడు 5.1.2012)
*కడప జిల్లా చక్రాయపేట గండి పుణ్యక్షేత్రానికి సమీపంలోని వీరన్నగట్టుపల్లె కు చెందిన కమాల్ బీ, మదార్‌ఖాన్ ల కుమారుడు ఖాదర్‌ఖాన్ (రామానంద కబీర్‌) ( 80 ) ఉమామహేశ్వర ఆలయాన్ని కట్టించి పార్వతీ పరమేశ్వరులను పూజిస్తూ బ్రహ్మచర్యం పాటిస్తూ నిత్యం అన్నదానం చేస్తున్నాడు.(సాక్షి కడప 9.1.2012)
*అనంతపురం జిల్లా గోరంట్ల మండలం వానవోలు గ్రామం లో ఆయుర్వేద డాక్టర్ అన్వర్ బాషా కోసం శివాలయం కట్టించాడు.ఈయన సత్య ధర్మ మకరందం,ఓ మనిషీ తెలుసుకో,కస్తూరి రంగనాధ స్వామి చరిత్ర,ఫకీర్ బాబా,మోక్ష మార్గం పుస్తకాలను రచించారు.(ఈనాడు అనంతపురం 23.1.2012)
*గుడ్ల వల్లేరు మండలం అంగలూరులో ఒకే ప్రాంగణం లో తాజుద్దీన్ బాబా కుటీర్ ,జ్ఞాన శాయి మందిరం ఉన్నాయి .ఇక్కడ కుల మతాలకతీతంగా పండుగలు చేసుకుంటున్నారు.ఇది ఒక అరుదైన ఆద్యాత్మిక కేంద్రం .(సాక్షి 2.2.2012)
*ఆదోనిలోని మహలక్ష్మమ్మనగర్ ముస్లిములు ప్రతియేటా వినాయకచవితి పూజల్లో పాల్గొంటున్నారు.అక్కడ ఖాజావలి పూజారిగా వ్యవహరిస్తున్నాడు.అక్కడి హిందువులు కూడా పీర్లకు దర్గాలకు మొక్కుతున్నారు.(సాక్షి 13.9.2013)
*

హిందూ మందిరం కోసం పోరాడుతున్న ముస్లింలు

పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీ లోని 150 ఏళ్ల చరిత్రాత్మక శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ మందిరం ఇప్పుడు ప్రమాదంలో పడింది. దానికి కొద్ది అడుగుల దూరంలోనే ఒక ఫ్లైఓవర్ నిర్మాణమౌతోంది. భారీ క్రేన్లు, ఎర్త్ మూవర్లు భూమిని అతలాకుతలం చేస్తున్నాయి. మీటర్లకు మీటర్లు గోతులు తవ్వేస్తున్నాయి. ఈ పనుల వల్ల కలిగే ప్రకంపనలు శ్రీ రత్నేశ్వర మహాదేవుడి గుడికి ప్రమాదంగా పరిణమించాయి.
గుప్పెడు మంది కూడా లేని పాకిస్తానీ హిందువులు గుడి కోసం పోరాడే పరిస్థితిలో లేరు. కానీ కరాచీలోని ముస్లింలు వారికి బాసటగా నిలుస్తున్నారు. పాక్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ తసదుక్ హుసేన్ జిలానీ ఈ నిర్మాణం వల్ల మందిరం పై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
రత్నేశ్వర్ మహాదేవ్ మందిరానికి ఘనమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు లాహోర్ లో ఉన్న అతి పెద్ద మందిరాల్లో అదొకటి. అక్కడ శివరాత్రి ఉత్సవాలు మహాఘనంగా జరిగేవి. అయితే ఇప్పుడు అదంతా గతం. కానీ ఆ గతాన్ని ఖతం కానీయబోమంటూ అక్కడి ముస్లింలు ముందుకొస్తున్నారు.(సాక్షి 26.3.2014)



సాక్షి4.12.2013



అందరివాళ్ళు(ఈనాడు17.10.2013)                        
ఈనాడు  24.4.2014
సాక్షి 17.8.2014

DECCAN CHRONICLE 17.8.2014
ఈనాడు 27.10.2014
(సాక్షి 26.12.2014)
(ఈనాడు 18.2.2015)
 (ఈనాడు 10.3.2015)
 ఈనాడు 4.4.2015
https://www.facebook.com/amjed.u.khan/videos/10205929201242692/

21 కామెంట్‌లు:

  1. చాలా బాగుంది కానీ,
    ఎక్కడైనా హిందువులు ఇచ్చిన వాటిని ముస్లిములు అంగీకరించారా? ఉదాహరణకి మనం హిందూ- ముస్లిముల ఐఖ్యత గురించి మాట్లాడుకునే టప్పుడు, హిందూ దేవాలయములో ముస్లిం పూజారి, హిందువుల గుళ్ళకు ముస్లిములు ఫలానావి ఇచ్చారు, సుప్లైచేశారు అని చెప్పుకుంటాం కానీ, మసీదులో "ఆజాను" (నమాజు తరువాత చెప్పే ప్రసంగం. సరైన పదం కాకపోతే క్షమించండి) హిందువు ఆజాను ఇచ్చాడు. మసీదుకి ఫలానా హిందువు ఇవి సుప్లై చేశాడు అనే ఉదాహరణలు ఎక్కడైనా ఉంటే వాటిని కూడా రాయండి.

    రిప్లయితొలగించండి
  2. మీ బ్లాగును ఇన్ని రోజులూ చూడలేకపోయినందుకు ఏదో కోల్పోయిన భావన కలుగుతోంది. చాలా మంచి బ్లాగు మీది. మీలా హిందువులు, ముస్లిములు , క్రైస్తవులు అందరూ ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. అప్పుడు కదా మనదేశం పూర్వ వైభవాన్ని పొందగలిగేది.

    రిప్లయితొలగించండి
  3. ఆకాశరామన్న గారూ మీ ప్రశ్నలోనే మీ పరమత అసహనం కన్పిస్తోంది. మసీదుకు వచ్చి ప్రార్థన చేస్తామంటే ఏ ముస్లిం సోదరుడు అడ్డుచెప్పడు. మసీదులకు హిందువులు ఏమీ ఇవ్వలేదు కాబట్టే మీ దగ్గర సమాధానం లేదు. మసీదులు కూలగొట్టకుండా వుంటే చాలు..

    రిప్లయితొలగించండి
  4. దీపావళి జరుపుకునే ముస్లింలని కొంతమందిని చూసా.

    రిప్లయితొలగించండి
  5. వడ్రంగి పిట్ట గారు,
    రెందుచేతులూ కలవందే చప్పుడు అవ్వదు. ఒక చేతితో మీరు ఎంత ప్రయత్నించినా అది కుదరదు. అందుకే, పరమత సహణము అనేది రెండు వర్గాలలో ఉండాలి. అంతే కానీ, ఏదో ఒక వర్గములో ఉన్నంత మాత్రాన దాని వలన ఉపయోగం ఉండదు, అది ఏదో ఒక రోజు జరిగే చిన్న గొడవ లో( అటు వైపు పరమత సహణం లేదు కాబట్టి, తప్పక జరుగుతాయి) హారతి కర్పూరంలా హరించుకు పోతుంది.

    అయినా, ముస్లిములలో హిందువులను, వారి సంప్రదాయాలను ఆమోదించిన వారు ఎందరో చెప్పండి అని ఆదగడమే పరమత అసహణానికి చిహ్నమని ఇప్పుడు మీరు చెబితేనే తెలుసుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  6. @ ఆకాశరామన్న గారూ
    మసీదులో "ఆజాను" అనేది నమాజుచేద్దాం రండి అని కులమత బేధాలు లేకుండా ప్రజలు అందరినీ పిలిచే పిలుపు.అది అరబ్బీలో ఉండటం వల్ల అర్ధంకాక ఎవరూ పట్టించుకోటం లేదు.అదే తెలుగులో ఉంటే దారినపోయే వారెవరైనా మసీదులోకి పోయి ప్రార్ధన చేసుకునేవారు.హిందువైనా ఆజాను ఇవ్వొచ్చు.మసీదుకి హిందువులు ఏమన్నా సప్లై చేస్తే నిరాకరించరు.అటు వైపు కూడా పరమత సహనం ఉంది.ముస్లిములలో హిందువులను,వారి సంప్రదాయాలను ఆమోదించటమే కాకుండా పాటించేవారు కూడా ఎందరో ఉన్నారు.ఎవరి మతాచారాలు వారివి.మనదంతా మానవజాతి.మానవత్వం,అహింస పరమ ధర్మాలు :
    "ఏదిహిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవమూ?
    ఎల్లమతముల సారమొకటే
    తోటకెల్ల వసంతుడొకడే "
    అనే భావంతో అందరం భాయీ భాయీ గా ఉండాలనే వాదాన్ని ప్రోత్సాహిద్దాం.దేశమంతటా వ్యాపింపజేద్దాం.

    రిప్లయితొలగించండి
  7. << మసీదులకు హిందువులు ఏమీ ఇవ్వలేదు కాబట్టే మీ దగ్గర సమాధానం లేదు. మసీదులు కూలగొట్టకుండా వుంటే చాలు.. >>
    తురకలు ఇచ్చింది కాశీ, మధుర, హంపీ, సోమనాథ్ , ఓరుగల్లు, కాశ్మీర్ ఇంకా వేలకొద్దీ హిందూ అలయాల్లో భిన్నమైన మూర్తులు ఇంకా సజీవసాక్ష్యాలుగా వున్నాయి. ఇస్లాం పుట్టుకే హింసతో పుట్టింది. ఆ స్థాపకుడే యుద్ధాలతో , యూదుల రక్తంతో కత్తిపట్టి మతవ్యాప్తికి పూనుకున్నాడన్న చరిత్ర సత్యం కాదా? మహమ్మదు వారసులు కుక్కల్లా తమలో కొట్టుకుని చచ్చారన్నడానికి సాక్ష్యం షియా మతం. మహమ్మదులాగే ఇంకా ఎవరో గొప్పవారు వస్తారు అన్న పాపానికి అహమ్మదీ తెగ వారు ప్రపంచవ్యాప్తంగా సున్నీలతో హింసించబడుతున్నారన్నది నిజం కాదా?
    ఇంకా ఇవ్వాలా? మిమ్మల్ని సహించడమే హిందువులే కాదు, క్రిస్టియన్లు, బౌద్ధులు, సిక్కులు ఎవరైనా మీకిచ్చిన గొప్ప బహుమానం.

    రిప్లయితొలగించండి
  8. అబ్దుల్ కలాం నా దృష్టిలో నిజమైన భారతీయ ముస్లిం.
    మహాత్మా గాంధీ తరువాత దేశప్రజలంతా అభిమానించిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది ఆయనే.

    మా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం కలిగితే మా అమ్మగారు చర్చికి, మసీదుకి కూడా వెళ్ళేవారు.
    కాకపోతే క్రైస్తవులు, ముస్లిములు దేవాలయాలకి వస్తారో, రారో నాకు తెలియదు.

    రిప్లయితొలగించండి
  9. అజ్ఞాత గారూ
    సహించడమే గొప్ప బహుమానం.ఎదుటి వారిని నొప్పించేది నిజం అయినా అది చెప్పకుండా మౌనం వహించటం మంచిది.అప్పుడెప్పుడో ముందు తరాలు వాళ్ళు చేసిందానికి ఇప్పటి వాళ్ళను బాధ్యుల్ని చేయద్దు.పూర్వం ఎవరో చేసిన పెంటపనులు ఇప్పటికీ గుర్తుచేసేకంటే మనప్రజలు శాంతిసామరస్యాలకోసం ఇప్పుడు ఏం చెయ్యాలో చెబితే బాగుంటుంది.అన్ని మతాలవాళ్ళూ వారి వారి మతాల కోసం అకృత్యాలకు పాల్పడ్డవారే. కానీ ఒక మతం కొమ్ముకాసే వారికి సొంతమతం పేరుతో జరిగే అరాచకాలు పుణ్యకార్యాలుగా కనబడతాయి.నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమే.పుట్టిన బిడ్డలు ఫలానా మతంలో పుట్టాలని కోరుకుని పుట్టరు.ఒక మతస్తులు గతంలో అకృత్యాలకు పాల్పడ్డారని ఆమత వారసులందరూ నేరస్తులైనట్లు వారు చేయని నేరానికి వారిని అపరాధభావనకు గురిచెయ్యటం అవమానించటం కూడా అకృత్యమే.ముస్లిముల పేర్లుపెట్టుకుని శాంతియుత జీవనం గడిపే వారికి వారి పూర్వీకులఅకృత్యాలను పదేపదే గుర్తుచేసే మతవాద రచయితలు కూడా ఉగ్రవాదులే.ముస్లిముల్లో శాంతియుత జీవనం గడుపుతున్న భరతమాత ముద్దుబిడ్డలు ఈ దేశంలో కోట్లాదిమంది ఉన్నారు.ఒకవేళ అంతగా అకృత్యాలు చేసే ఇస్లామ్ మతాన్ని వద్దనుకొని ఈనాటి ముస్లిములు బయటకు రాదలుచుకుంటే హిందూ మతంలో చేరే చట్టపరమైన అవకాశం ఉందా?అందరికీ సగౌరవంగా బ్రతికే దారికావాలి.కౌరవ సంతతినైనాసరే నిందించి నలిపి చంపటం కంటే మానవత్వంతో కలుపుకు పోవటమే మంచిది.ఎప్పుడో ఎవరో చేసిన అకృత్యాలను మళ్ళీ మళ్ళీ కొన్ని తరాలపాటు గుర్తుచేసి ఆ మతంలో ఉన్నఈనాటి వారసుల్ని నిందలువేసి అవమానిస్తే అది హిందూ మతం ప్రకారం మోక్షసిద్ధినిస్తుందా?హింసకు జవాబు హింసేనా?ఈ దేశంలో పుట్టటమే ఏ మతస్థుడికైనా (తురకలకు కూడా)ఎన్నోజన్మల పుణ్యఫలం అంటారు కదా.యుద్ధం అంటేనే నరబలి.హింస ద్వారా జరిగిన కార్య క్రమాలు కష్టాలే మిగిల్చాయి.శుద్ధ సాత్వికతతో మాత్రమే భగవంతుని ఆరాధించాలి.

    రిప్లయితొలగించండి
  10. ప్రతి మతంలొ కొన్ని సుగుణాలుంటాయి అలాగే కొన్ని నచ్చని అంశాలూ వుంటాయి.రాజా రామ్మోహన రాయ్,కందుకూరి వీరేశలింగం లాంటి సంఘసంస్కర్తల కృషి వలన హిందూమతం ఎంతో బాగుపడింది.మన పూర్వీకులంతా హిందువులే.హిందు మతంలోని కుల వివక్షకు తట్టుకోలేక వేరే మతాలు స్వీకరించి ఉంటారు.ఎన్నో దురాచారాలను హిందుమతం వదులుకుంది కాని ఇంకా కుల వ్యవస్థ
    పోలేదు.అలాగే ముస్లిములమని చెప్పుకునే ఎంతోమందిలో కూడా
    కట్నాలు,తెగలు,కులాలు,వడ్డీ,జూదము,త్రాగుడు,వ్యభిచారము,దొంగతనము,అబద్దాలు,హత్యలు,మొదటి భార్యను అడగకుండానే రెండోపెళ్ళి చేసుకోవడం,ఏకపక్షంగా విడాకులు ఇవ్వడం,బానిస స్త్రీలను వాడుకోవడం,మనసుతో పనిలేకుండానే తెలియని భాషలో యాంత్రికంగా ప్రార్ధన చెయ్యడం,కొడుకులు చూడకుండా విడిచిపెట్టిన ముసలి తల్లి దండ్రులకు వృధ్ధాశ్రమాలు కట్టకపోవడం,పేదరికంలో వుండి కూడా నారుపోసినవాడే నీరుపోస్తాడని యెక్కువ మంది పిల్లల్ని కని చదివించకుండా పనికిమాలిన వాళ్ళుగా తయారు చెయ్యడం లాంటి దురాచారాలు వున్నాయి.ముస్లిములందరిలొ కాదు కొందరిలో.అలాగని ఇస్లాం మతాన్ని తప్పు పట్టకూడదు కదా? ఇస్లాం యెన్నో దురాచారాలను నిర్మూలించింధి.అలాగే హిందు మతస్థుల్లో వున్న దురాచారాలను ఆ మతంలోని మహానుభావులే పొరాడి సంస్కరణలు తెచ్చారు తెస్తున్నారు ఇంకా తెస్తారు.మంచితనం,మానవత్వం అనే
    సద్గుణాలు లేని మతం ఏదైనా సంస్కరించబడాల్సిందే."మంచి చెడ్డలు రెండే మతములు" అనే సూక్తికి తిరుగు లేదు.మంచి ఏ మతంలో వున్నా స్వీకరించుదాం.చెడు ఏ మతంలో వున్నా తిరస్కరించుదాం. మనమంతా మనుషలం.మానవత్వమే మన మతం.నాలుగైదు మతాలు మారిన వారికి మంచి జ్ఞానం లభించ వచ్చు గాని మంచితనం
    అబ్బకపోతే ఏమిటి లాభం?.మతాన్ని మారణకాండకు సాధనంగా మలచుకొంటున్న రాజకీయ నాయకులు మతాధిపతులు నరకానికే పోతారు.మంచికి వాడని మతం నిరుపయోగం. పరమేశ్వరుడైన దేవునికి ఆల్లాహ్,ఈశ్వర్,యెహోవా లాంటి పేర్లు మనిషి ఎన్ని పెట్టుకున్నా ఆ దేవునిలో వున్నంత ఓర్పు,సహనం,శాంతి,క్షమ,దయ,మనలో వుంటే మత కలహాలు జరగవు.స్వర్గం ఇక్కడే వుంటుంది.పరస్పర ప్రేమ
    కోసం కృషి చేద్దాం.హిందూం ముస్లిం భాయీ భాయీ.

    రిప్లయితొలగించండి
  11. @ ఆకాశ రామన్న గారు

    నిజామాబాద్ జిల్లాలోని మా ఊరికి ఒక సారి రండి, పరమత సహనం అంటే ఏంటో చూడొచ్చు, రీసెంటుగా జరిగిన ఒక సంఘటన చెబుతాను.......
    మా మిత్రుడొకరు రాత్రి సమయంలో తన కుటుంబంతో పక్కనున్న టౌన్నుండి బైకుపై వస్తుండగా ఒక దర్గా సమీపంలో యాక్సిడెంటు అయ్యింది, ఆ సమయంలో దర్గాలో ఉన్న ఒక ముస్లిం సొదరుడు వెంటనే తన ట్రాలీఆటోలో వీళ్ళని టౌన్ కి తీసుకెళ్ళడం మాత్రమేకాదు, ఆ రాత్రి హాస్పటల్ ఖర్చు 30,000 తనే ఇచ్చాడు, ఆ డబ్బు తన కూతురు పెళ్ళి కోసం బ్యాంకునుండి డ్రా చేసి తీసుకెళ్తున్నాడు, నీళ్ళు తాగడానికి ఆ దర్గా దగ్గర ఆగాడు..............

    ఆ ముస్లిం సోదరుడు గాయపడింది మా మతం వాడు కాదులే అని అక్కడే వదిలేసుంటే నా మిత్రుడు మాకు దక్కేవాడు కాదు....... ఆ సమయంలో తనకి గుర్తొచ్చింది మానవత్వం మాత్రమే.... మతం కాదు.........

    ఇంకొక సందర్బములో ఒక ముస్లిం మిత్రుడు మెదక్ జిల్లా నర్సాపూర్ అడవుల్లో యాక్సిడెంట్లో గాయపడితే అక్కడే ఉన్న హనుమాన్ మందిర్ పూజారి గుడిప్రాంగణంలోకి తీసుకెల్లి సపర్యలు చేసాడు.....

    ఇలా నా దగ్గర చాలా అనుభవాలు ఉన్నాయి ... హిందు ముస్లింల స్నేహం గురించి

    రిప్లయితొలగించండి
  12. వంశీ మద్దిపాటి గారూ ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  13. “అల్లాయంచు మహమ్మదీయులు జెహోవాయంచు సత్క్రైస్తవుల్

    ఫుల్లాబ్జాక్షుడటంచు వైష్ణవులు శంభుండంచు శైవుల్ సదా

    ఉల్లాసంబున గొల్వ నెల్లరనాయుర్భోగభాగ్యాది సం

    పల్లాభంబు లొసంగి బ్రోచు పరమాత్ముండొక్కడే చూడుడీ!”

    మతములన్నియు వేరు మార్గంబు ఒక్కటే / వస్త్రభేదము వేరు వస్తు వొకటె

    శృంగారములు వేరు బంగార మొక్కటే / పశులవన్నెలు వేరు పాలు వొకటె

    జీవజంతులు వేరు జీవుండు ఒక్కడే / జాతినీతులు వేరు జన్మ మొకటె

    దర్శనంబులు వేరు దైవంబు ఒక్కడే / పూలవన్నెలు వేరు పూజ ఒకటె"

    “సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న / విద్యలన్నియు నేర్చి విలువ సున్న

    సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న / దాన ధర్మాల సార్ధకత సున్న

    సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న / పదవులనేలిన ఫలము సున్న

    సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న / బహుళ సత్కార్య లాభంబు సున్న

    "మతములన్ని కూడ మంచినే బోధించె

    తెలిసి మెలగవలయు తెలివితోడ

    మతులు మంచివైన మతమేమి చెడ్డది?

    వినుము భారతీయ వీరసుతుడ!" --సత్యసాయి

    రిప్లయితొలగించండి
  14. కొన్ని సార్లు సమయం సందర్భం గమనించకుండా వ్యాఖ్యలు మనసులోనుంచి బయటకు వస్తాయి.చంద్రబాబు నాయుడు గారు 2010 లో కుప్పం పర్యటనలో స్థానిక మసీదు లో ఇఫ్తార్ కు వెళ్ళి నమాజు చేసి ఇది నా పూర్వజన్మ సుకృతం అన్నారు.ముస్లిములు పూర్వజన్మను నమ్మరు.అదివిన్న ముల్లా గారు క్రితం జన్మలో ఎవరు ఏ మతంలో, ఏ ప్రాంతములో ఎలా పుట్టారో ఎవరికి తెలుసు ? వచ్చే జన్మలో హిందువులు ముస్లిములుగానూ,ముస్లిములు హిందువులుగానూ కూడా పుట్టొచ్చు అన్నారు

    రిప్లయితొలగించండి
  15. https://www.facebook.com/photo.php?fbid=810168222348503&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater&notif_t=like

    రిప్లయితొలగించండి
  16. https://www.facebook.com/photo.php?fbid=848979061800752&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater&notif_t=like

    రిప్లయితొలగించండి
  17. https://www.facebook.com/photo.php?fbid=1031506890214634&set=a.233025936729404.60739.100000659993594&type=3&theater

    రిప్లయితొలగించండి
  18. https://www.facebook.com/photo.php?fbid=1029001053798551&set=a.464551206910208.105402.100000659993594&type=3&theater

    రిప్లయితొలగించండి
  19. https://www.facebook.com/photo.php?fbid=725773194121340&set=a.233025936729404.60739.100000659993594&type=3&theater

    రిప్లయితొలగించండి