ఈ బ్లాగును సెర్చ్ చేయండి

15, మే 2010, శనివారం

కులనిర్మూలన

కులాంతర మతాంతర వివాహాలకు ఇచ్చేప్రోత్సాహక మొత్తాన్ని 25000 నుండి 50000 రూపాయలకు పెంచారు.డాక్టర్ అంబేద్కర్ మొదలు అభ్యుదయవాదులు, మానవతావాదులు కులనిర్మూలన కోసం పోరాడుతున్నారు కానీ పెద్దగా ప్రయోజనం లేదు.హెచ్చుసంఖ్యలో కులాంతర వివాహాలు జరగటం వల్లమాత్రమే కులనిర్మూలన జరుగుతుంది.”రాజ్యాంగం రాసినవాడే కులాంతర, మతంతర వివాహాలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేసినా ఈనాటికి కులమత ప్రసక్తిలేని, ఏ కులమో చెప్పలేని భారత జాతి గణనీయంగా పెరిగి కుల, మత కలహాలను సమసింపజేసి ఉండేది.దళిత శిక్కులు, దళిత బౌద్ధులు దళితులే నని తీర్మానిస్తూ రాజ్యాంగ సవరణ జరిగింది. దళిత క్రైస్తవులు, దళిత ముస్లిములను షెడ్యూల్డ్ కులాల వారిగానే పరిగణించాలని కేంద్ర కేబినెట్ 1997 లో ఆమోదించింది. పార్లమెంటులో బిల్లు పాస్ కాలేదు. భారత ముస్లింలలో 85% మంది పూర్వీకులు హిందూ దళితులేనని ఆంధ్రపదేశ్‌లోని క్రైస్తవులలో 98 శాతం మంది పూర్వీకులు హిందూమతంలోని దళిత కులాల నుంచి వచ్చినవారేనని మానవ వనరుల అభివృద్ధి శాఖ సలహాదారు కృష్ణన్‌ చెప్పారు. కొల్హాపూర్‌ మహారాజు తొలిసారిగా 1902లో ముస్లింలకు రిజర్వేషన్‌ ప్రవేశపెట్టారు. 1921లో మైసూర్‌ మహారాజు కూడా అదే చర్య చేపట్టారు. బాంబే ప్రెసిడెన్సీ, అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కూడా ఈ కోటాను ప్రవేశపెట్టాయి.దళిత క్రైస్తవులను కూడా దళితులుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ మన రాష్ట్రం 25.8.2009 న అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీన్ని టీడీపీ, ప్రరాపా, తెరాస, ఎంఐఎం, సీపీఐలు కూడా సమర్థించాయి. భాజపా లోక్ సత్తా దీన్ని వ్యతిరేకించాయి. ఇది హిందువులకు వ్యతిరేకమని, దీనివల్ల మతమార్పిడులు ప్రోత్సహించినట్లు అవుతుందని భాజపా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి విమర్శించారు.మత ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. దళిత క్రిస్టియన్లు, ముస్లింలమీద ప్రేమ ఉంటే బీసీల్లోనే ఉంచి కోటా పెంచాలని కోరారు.

కుల నిర్మూన గురించి అంబేద్కర్ మాటలు:
* “కులంవల్ల ఆర్దిక శక్తియుక్తులేమీ సమకూడవు.కులంవల్ల జాతి కూడా ఏమీ వికసించదు,వికసించలేదు.కానీ కులం ఒకపని చేసింది.అది హిందువులు నీతి నికోల్పోయి పూర్తిగా చిన్నాభిన్నామయ్యేలా చేసింది.కులాలు ఒక కూటమిగాకూడా ఏర్పడలేవు.ఒక కులం ఇంకొక కులానికి అనుబంధం గా కూడా ఉండదు.ప్రతి కులం మిగతా కులాలనుండి తానొక ప్రత్యేక కులంగా గుర్తింపుకోసం పోరాడుతుంది.కులవ్యవస్థ అందరూ కలిసి పాల్గొనే ఉమ్మడి కార్యక్రమాన్ని అడ్డగిస్తుంది.ఇది మన అందరి పని అనే స్పృహ లేకుండా, ఐఖ్యం కాకుండా చేస్తుంది.కులంఉండటం, కులస్పృహ ఉండటం వల్ల పాత వివక్ష లన్నీ గుర్తుకొస్తూ సమైఖ్యత ఆగిపోతున్నది.క్లబ్బు సభ్య త్వం లాగా కులం సభ్యత్వం అందరికీ రాదు.కులంలో సభ్యత్వం కావాలంటే ఆకులంలో పుట్టాలి.అది కులధర్మం .కులాలు స్వయంప్రతిపత్తి గలవి. ఎవరైనా కొత్తవ్యక్తి వస్తే ఒక కులంలోకి చేర్చుకొమ్మని చెప్పే అధికారం ఎవరికీ లేదు. హిందూ సంఘం ఒక కులాల కూటమి . ప్రతి కులం మూసుకుపోయి ఉంటుంది కాబట్టి కులం మారే అవకాశం ఎవరికీ ఉండదు. హిందూసమాజం విస్తరించకుండా ఇతర మతస్థులను కలుపుకోకుండా కులమే అడ్డుపడింది. కులాలున్నంతవరకు హిందూ మతం విశ్వజనీన సేవా మతం కాలేదు.శుద్ధి హాస్యాస్పదం,నిష్ఫలకార్యక్రమం.కులం సంస్కర్తలనూ,సంస్కరణలనూ నాశనంచేసే ఆయుధం .తన కులంకాని వాడిలో ఉన్న ప్రతిభ ను ప్రశంసించే శక్తి హిందువులో ఉండదు.మౌర్యుల కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ ను సమూలంగా తుడిచిపెట్టారు.”
*బొందిలి,దూదేకుల ఇప్పటికే బిసి.బి గ్రూపులో ఉన్నాయి.మెహతార్ లు బి.సి.ఏ గ్రూపులో ఉన్నారు.ముస్లిముల్లో సాంఘికంగా విద్యాపరంగా వెనుకబడిన ఈ 14 తరగతులకు బి.సి.ఇ గ్రూపులో రిజర్వేషన్ ఇచ్చారు:
* 1. అచ్చుకట్లవాండ్లు, సింగలి, సింగంవాళ్లు, అచ్చుపనివాళ్లు, అచుకట్టువారు,
* 2. అత్తరు సాయిబులు, అత్తరోళ్లు
* 3. దోభీ ముస్లిం , ముస్లిం దోభీ , ధోబి ముసల్మాన్ , తురక చాకలి , తురక చాకల , తురుక సాకలి , తురకల వన్నన్ , చాకల , సాకలా , చాకలా , ముస్లిమ్ రజకులు
* 4. ఫకీరు , ఫకీరు బుడ్‌బుడ్కి , గంటి ఫకీర్, గంటా ఫకీర్లు , తురక బుడ్‌బుడ్కి , దర్వేష్ ఫకీర్
* 5. గారడీ ముస్లిమ్ , గారడీ సాయిబులు , పాముల వాళ్లు , కనికట్టు వాళ్లు , గారడోళ్లు , గారడిగ
* 6. గోసంగి ముస్లిమ్, పకీరుసాయిబులు
* 7. గుడ్డి ఎలుగువాళ్లు, ఎలుగుబంటు వాళ్లు, ముసల్మాన్ కీలుగుర్ర వాళ్లు
* 8. హజమ్, నాయి, నాయి ముస్లిమ్, నవీద్
* 9. లబ్బి , లబ్బాయి , లబ్బన్ , లబ్బ
* 10. పకీరియా, బోరెవాలె, డేరా ఫకీర్లు, బొంతల
* 11. ఖురేషి, కురేషి,ఖసబ్, మరాఠి ఖాసబ్, కటిక ముస్లిం, ముస్లిం కటిక.
* 12. షైక్, షేక్
* 13. సిద్ధి, యాబ, హబ్షి, జసి
* 14. తురక కాశ, కుక్కుకొట్టె జింకసాయిబులు, చక్కిటకానెవాలె, తిరుగుడు గుంటలవారు, తిరుగాటిగంట, రోళ్లకు కక్కు కొట్టేవారు, పట్టర్ పోదులు, చక్కటకారె,
* 15. ఈ 13 ముస్లిం కులాలు రిజర్వేషన్లకు అర్హులుకాదు:1.సయ్యద్, 2.ముషేక్,3. మొఘల్, 4.పఠాన్, 5.ఇరాని,6. ఆరబ్,7. బొహరా, 8.షియా,9. ఇమామి, 10.ఇష్మాయిల్, 11.కుచిమెమన్,12. జమాయత్,13. నవాయత్లు
మహమ్మదీయుడి కంటే ముందు వాడొక మనిషి.సాటి భారతీయుడు.బ్రతుకుతెరువు లేని పేదవాడు.మానవత్వం చూపించాలి.మతంపేరుతో అతనికి ఏహక్కులూ అవకాశాలూ ఇవ్వకూడదా?ఎప్పుడో ఎవడో కిరాతకుడు చేసిన పనికి ఎన్నాళ్ళు నేటి తరం అవమానం పడాలి?రోళ్ళు తయారు చేసేవారు, గంట్లు కొట్టేవాళ్ళు,అన్ని మతాల్లోనూ వున్నామిగతా మతాల్లోని వారికి ఎంతోకొంత వారివారి కులాలరూపంలో రిజర్వేషన్ దొరికింది.ఇస్లాం మతంలో ఉన్న వారికి మాత్రమే ఇవ్వకూడదని అడ్డుకోవడం అన్యాయంకాదా?అసలు ఈ రిజర్వేషన్ అందుకునే అవగాహనేలేక గంటాఫకీర్ లాంటి వాళ్ళు అల్లాడుతుంటే అగ్రవర్ణ ముస్లిములే గంటాఫకీర్ అవతారాలెత్తి ఈ సీట్లలో దూరుతున్నారట.పేదరికం ఆత్మాభిమానాన్ని హరించి ఎంతగా మనిషిని దిగజారుస్తుందో చూడండి.మతం కంటే మానవత్వమే మంచిది. ఎన్నో కమీషన్లు వారి పరిస్థితి దళితులకంటే హీనంగా ఉందని రిపోర్టులు ఇచ్చాయి.రిజర్వేషన్ కు మతం ప్రాతిపధిక వద్దు అనుకుందాము.మరి ఏ రకంగా ఆ వర్గానికి సాయం చెయ్యాలి?మతం మానవత్వాన్ని హరిస్తూ ఉంది కాబట్టే ఇకనైనా కులాంతర, మతంతర వివాహాలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేయటం మంచిదని నా భావన.

*మోదుకూరి జాన్సన్‌ అంబేద్కరిస్ట్.కులం వలన ఆత్మ న్యూనతకు గురికాకుండా కులాన్ని తమ పేరుతో పాటు జత చేసుకో వాలని దళితులకు జాన్సన్‌ సూచించారు. మతం అంటే జీవనమార్గం, కులం అంటే సమాజంలో వృత్తి పరమైన గుర్తింపు. వీటి సహకారంతో మనిషి ఇప్పటివరకూ జీవిస్తూ వచ్చాడు. స్వేచ్ఛగా, ఇతరులకు హాని లేకుండా జీవనం సాగిస్తే ఏ బాదరబందీ వుండదు. ఉన్మాదం లేదా ‘fanaticism’ బయలుదేరకూడదు. మతాంతర వివాహాలు చేసుకున్న పెద్ద పెద్ద వారికి పెద్ద సమస్యలుండవేమో, చిన్నా చితకా మనుషులకు, మధ్యతరగతి కుటుంబీకులకు ఇంకనూ సమస్యల సుడిగుండమే. కులం అనేది సామాజిక గుర్తింపు అయితే, కులం లేకుండా పోవడం అనేది కూడా ఓ గుర్తింపే.ప్రతి మనిషి తన గుర్తింపు తన సమూహపు గుర్తింపు ప్రపంచం గుర్తించాలని కోరుకుంటాడు.కానీ ఇక్కడ కులాలు ‘తక్కువ’ ‘ఎక్కువ’ అనే ధోరణి వుండకూడదు.ప్రతి కులస్తుడూ తాను సరి, అని అనుకుంటాడు. అలాంటి సమయంలో ఇతరులు సరి కారు అనే అర్థం స్ఫురిస్తుంది. ప్రతి మతంలోనూ ప్రతి కులంలోనూ ఉదాత్తులు ఉన్నారు. సర్వజ్ఞానులూ ఉన్నారు.కులాల పరంపర వేల సంవత్సరాలనుండి వస్తోంది. భారత్ లో వర్ణక్రమం అందులోని భాగమే. నేడు భారత్ జనభా 110 కోట్లు, కులాలు వేల సంఖ్యల్లోనే. ఒక్క మాటున కులనిర్మూలన అసాధ్యం. కులనిర్మూలనకే మన ఓటు.ఈకులాలు మనకు కూడు పెట్టవు.
*మనము కులాల బందీఖానాలో ఉన్నాము.కులనిర్మూలన అనవసరం అనేవాళ్ళూ ఉన్నారు.కులాలు ఉండాలి,కులతత్వం పోవాలి అనేవాళ్ళూ ఉన్నారు.పరస్పర ఆకర్షణ,ప్రేమ ఉన్నాసరే వేరు వేరు కులాలు మతాలకు చెందిన జంటలు పెళ్ళి చేసుకోటానికి అంగీకరించని పెద్దలున్నారు.రిజర్వేషన్ల కోసమైనా కులాలుండాలి అనేవాళ్ళూఉన్నారు.మరి కులనిర్మూలనకు దేశంలో సానుకూలత రావటం కోసం ఇలాంటి చర్చలు బాగా జరగాలి. గొంతుదాకా తిని కులం అడిగే వాళ్ళూ,కూటికి పేదలం కానీ కులానికి పేదలం కాదని విర్రవీగే వాళ్ళూ,కులంతక్కువ వాడు కూటికి ముందని అవమానించే వాళ్ళూ,కులనిర్మూలన జరిగేదాకా ఉంటారు.కులాంతర మతాంతరవివాహాలు మన దేశంలోని కులమత ద్వేషాలకు శాంతియుత విరుగుడు మందులు.ఏకులమో ఏమతమో చెప్పుకోలేని హైబ్రీడ్ పిల్లలు భారీగా పుట్టాలి.ఈసంకర పిల్లలే రేపటి భారతావనికి శాంతి దూతలు కావచ్చుకులం లేకుండా పోవడం వల్లనే మనలో నిజమైన ఐఖ్యత వస్తుంది.
*కులాంతర మతాంతర వివాహాలు భారీగా జరగాలని అంబేద్కర్ తోపాటు గాంధీజీ కూడా కోరారు.కాకపోతే అటువంటి వివాహాలకు తగిన ప్రోత్సాహకాలను ఆనాడే ప్రకటించలేదు. వారి మరణానంతరం వంద సార్లు రాజ్యాంగ సవరణలు జరిగినా ఈ అంశం ఎవరూ ముట్టుకోలేదు.ఇప్పటికైనా కులాంతర, మతంతర వివాహాలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేయాలి.కులమత ప్రసక్తిలేని, ఏ కులమో చెప్పలేని భారత జాతి గణనీయంగా పెరిగితేనే కుల, మత కలహాలు సమసిపోతాయి..
 https://www.facebook.com/photo.php?fbid=765565526808773&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

ఉగ్రవాదికి మతంలేదు

ఉగ్రవాదికి మతం ఏంటండీ?
వాడు మతాన్ని అడ్డం పెట్టుకున్న హంతకుడు.
హంతకుడు పాతబస్తీలోని మదరసాలో ఉన్నా,తిరుపతి పాపనాశనంలో ఉన్నా పట్టుకొని ఈ దేశ చట్టాల ప్రకారం శిక్షించాల్సిందే

*.ఇస్లాం దృష్టిలోఉగ్రవాదం నిషిద్ధం.ఇస్లామ్ లో ఈ హరామ్ పనికి చోటులేదని, ఇస్లాం మానవత్వానికి కట్టుబడి ఉందని జమీయతుల్ ఉలమాయె హింద్ ఫత్వా జారీచేసింది.

* ఉగ్రవాదుల మృతదేహాలను ముక్కలు, ముక్కలుగా కోసి సముద్రంలో పారేయాలని ముస్లిం పెద్దలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ప్రజల రక్తాన్ని మలినం చేసిన వారికిదే సమాధానమని వారు పిలుపునిచ్చారు.ఇస్లాంలో హింసకు, ఉగ్రవాదానికి తావు లేదని ఉగ్రవాదుల మృత దేహాలను పూడ్చిపెట్టడానికి స్థలాన్ని నిరాకరించాలని ,ఉగ్రవాదులు నిజమైన ముస్లింలు కాదని, పంజాబ్‌లోని పాటియాలా జిల్లా సమనాలో జరిగిన కాన్ఫరెన్స్‌లో ముస్లిం మత పెద్దలు, ఇతర ముస్లిం ప్రముఖులు ,హర్యానా గవర్నర్ ఎకే కిద్వాయ్ అన్నారు.ఆంధ్రజ్యోతి 4.12.2008.

* ఇలాంటి మంచిని కోరే 99% ముస్లిములు ఉగ్రవాదాన్ని తిరస్కరిస్తున్నారు.ఉగ్రవాదులు ఏ మతంలో ఉన్నా వారికి నరకమే వస్తుంది.హింసను ప్రోత్సహించే మతలేఖనాలను లెక్క చెయ్యవద్దు.సర్వేజనా సుఖినోభవ తో ముస్లిములూ గొంతుకలుపుతారు.

* హింసను బోధించే కురాన్ వాక్యాలు నాకు అక్కరలేదు.ఇలాంటి వాక్యాలు ఏ మతగ్రంధాలలో ఉన్నాపట్టించుకోకుండా మానవత్వాన్ని చూపటమే మంచి భక్తి. ఇస్లాం మతం తీవ్రవాదాన్నిఉగ్రవాద చర్యలను ఖండిస్తుంది . ఒక వ్యక్తిని చంపితే సర్వ మానవాళిని చంపినట్లే భావించాలి. చంపడమే తీవ్రవాదమైతే 17 లక్షల మందిని చంపిన మాజీ అమెరికా అధ్యక్షుడు బుష్ ప్రపంచంలోనే అతి పెద్ద తీవ్రవాది.ఇస్లాం ప్రపంచంలోని సర్వ మానవాళి సౌభ్రాతృత్వాన్ని కోరుతుంది.---ఇస్లామిక్ అకడమిక్ కంపారిటివ్ రిలీజియన్ (ఐఏసీఆర్) అధ్యక్షుడు ఆసిఫుద్దీన్ ముహమ్మద్ (ఈనాడు కర్నూలు 16.2.2009).

*ఇస్లాం ఉగ్రవాదానికి వ్యతిరేకం- రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ రహ్మెత్‌ఖాన్ (ఈనాడు హైదరాబాదు 16.2.2009)

*బంగ్లాదేశ్ లో ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధిస్తున్నారు.ఉగ్రవాదులకు మరణశిక్ష, యావజ్జీవం, మూడేళ్ల నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగారంలాంటి శిక్షలలో ఏదైనా విధించే అవకాశముంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేవారికి సైతం మూడేళ్ల నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగారం విధించే అవకాశం ఉంది.

*ఉగ్రవాదం అన్ని మతాలకూ శత్రువే.క్షమను పెంచడానికి, ఉగ్రవాదాన్ని తుంచడానికి సమైక్యంగా కూడిరావాలి.---- ఐక్యరాజ్యసమితి సదస్సులో సౌదీరాజు అబ్దుల్లా
*తురక టోపీలు,భారత దేశంపై దాడి చేస్తున్న ఇస్లాం సంస్థలు,సుల్తానుల అకృత్యాలు,లాంటి పదజాలాన్ని ఇంకా ఇంకా ఎంతకాలం ప్రయోగిస్తారు?ఇక్కడున్నకోట్లాది భారతీయ ముస్లిములపై సోదరభావం చూపించటానికి బదులు పాత వెధవలందరిని నిరంతరం గుర్తుచేస్తూ ఈ నాటి ముస్లిముల్ని అనుమానంగా చూస్తూ ఉండటం ధారుణం.
ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా భారతీయముస్లిముల్లోకి కూడా కులం పాకింది.పుట్టుకతో అందరూ శూద్రులే.భారతదేశంలో పుట్టుకే ఎన్నోజన్మల పుణ్యఫలం.అన్ని మతాలలో యుద్ధాలున్నాయి.నరహంతకులే శవం మీద మరమరాలు ఏరుకుతింటారు.హింసకులకు మతం ఒక సాకు మాత్రమే.మానవత్వమే అన్నిటికన్నా మంచి జీవన మార్గం.
 లేఖనాలలో హింసను వ్యతిరేకించే వాక్యాలను మాత్రమే గుర్తుచేసుకుందాం.కడుపుచించుకుంటే కాళ్ళమీద పడుతుంది అని ఎంతకాలం కడుపులోనే అశుద్ధాన్ని మోయటం?ఇలాంటి కిరాతకులను ఎవరూ సమర్దించరు.ఉగ్ర వాదము , పరమత అసహనం మీద ఎంత చర్చ జరిగితే అంతమేలు.

*హంతకులు అన్ని మతాలలో ఉన్నారు.మతాన్ని అడ్డం పెట్టుకొని ఆడవాళ్లను హిసించమనీ, ఒకటికి వంద పెళ్ళిళ్లు చేసుకోమనీ , ఉగ్రవాదానికి ఊతం ఇవ్వమనీ,ఇతరమతాల గుళ్లు గోపురాలు, అందులోని విగ్రహాలు పగలగొట్టమని ఇస్లాం బోధించిందా?సతీ సహగమనం లాంటి అనేక దురాచారాలను హిందూ మతం సరిదిద్దుకుంది.అలాగే ఇస్లాంమతంలో కూడా నిరంతరం సంస్కరణలు జరుగుతూనే ఉండాలి.మంచికోసం మనుషులు కదులుతారు కానీ ఎవడో చేసిన పాడుపనుల మచ్చలను ఈనాటి అమాయకులు మోయరు.నారుపోసినవాడే నీరు పోస్తాడనే ముల్లాల మాట పెడచెవిన పెట్టి మా బిడ్డల బరువు మేమే మోసుకోకతప్పదనే సత్యాన్ని గ్రహించి ముస్లిములు ఈనాడు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు భారీగా చేయించుకుంటున్నారు.భవిష్యత్తులో మానవతావాదం మతాల్లో ఇంకా ఇంకా పెరిగితీరుతుంది.
ఎవరో అన్న మాటలను అందరికి ఆపాదించకూడదు.తప్పు ఎవరు చేసినా తప్పును తప్పుగా ఖండించాలి.మనకు కావలసింది శాంతి.నేరస్థుడు మతంతో నిమిత్తంలేకుండా శిక్షించబడాలి.పాత నేరస్థుల పాపాలచిట్టాకు ఈనాటి అమాయక వారసులు జవాబివ్వలేరు.అప్పటికి వీళ్ళెవరూ పుట్టలేదు.వాళ్ళు చేసిన అకృత్యాలకు వీళ్ళ పర్మిషన్ లేదు.వీళ్ళు ఏ విధంగానూ బాధ్యులు కాదు.శాంతియుత ప్రజా జీవనానికి భంగంకలిగించే ప్రతి తీవ్రవాదీ ప్రజాకంటకుడే.
అహింసామార్గం అత్యున్నతమైనది.మనందరం కలిసి సోదరభావాన్ని,శాంతిసామరస్యాలను ప్రభోదిద్దాం.మనం మాత్రం బ్రతికినంతకాలం మానవత్వాన్ని ఎక్కిస్తూనే పోదాం.వినేవాళ్ళే వింటారు.వినని వాళ్ళకు కసబ్,వికారుద్దీన్ ల గతే పడుతుంది.ఉగ్రవాదులు అమాయకుల్నిధారుణంగా చంపినప్పుడల్లా కాన్ఫరెన్స్‌లోని మతమౌఢ్య నాయకులలో ఇలాంటి ఆవేశపూరిత మాటలు పెల్లుబుకుతుంటాయి.మరోవైపు హింసను బోధించే కురాన్ వాక్యాలు నాకు అక్కరలేదు.ఇలాంటి వాక్యాలు పట్టించుకోకుండా మానవత్వాన్ని చూపటమే మంచి భక్తి అనే వాళ్ళూ ఉన్నారు.అహింసావాదుల సంఖ్య పెరుగుతూ ఉండాలంటే ఆ మత లేఖనాలలోని హింసా ప్రవృత్తి మీద ఎంత చర్చ జరిగితే అంత మంచిది.