ఈ బ్లాగును సెర్చ్ చేయండి

19, జులై 2012, గురువారం

ఆవేదనకు మందు ఆలింగనమే


                            ఆవేదనకు మందు ఆలింగనమే
                                                        --- నూర్ బాషా రహంతుల్లా (ఫోన్ 9948878833,6301493266)
దూదేకు సాయిబుల సామాజిక ఆధ్యాత్మిక పరిస్థితుల గురించి ఈ మధ్య గీటురాయిలో మంచి వ్యాసాలు వచ్చి కాస్త ఆలోచన కలిగించాయి.సోదరులిద్దరిలో ఒకరి ఆవేదనా  మరొకరి ఆత్మీయ ఆలింగనా చూస్తే బతికిన బతుకు చెప్పుకుందాం బయట ఎవరూ లేకుండా చూడు అనే సామెత గుర్తొచ్చింది. .మిమ్మల్ని చరిత్ర క్షమించదు,అల్లా అసలు క్షమించడు అంటూ సిద్దీక్ దూదేకుసాయిబుల  తరుపున దబాయిస్తే ,”సమ సమాజం రావాలి,ధర్మం ఎవరి గుత్త సోత్తూ కాదు అంటూ షఫీ సముదాయించారు.మొత్తమ్మీద సిద్దీక్ జన్మమెత్తితిరా అనుభవించితిరా అని ఆవేధన చెందితే, షఫీ అన్నఒడిజేర్చి ఆటలాడించు నాటి కదా పాడనా? ఎదురు చూసి మోసపోకుమా’,‘నీ కొండకు నీవే రప్పించుకో లాంటి మాటలతో  ఇస్లాం లోని సమతా వాతావరణాన్ని, ఔదార్య భావాలనూ ,ఆత్మస్థైర్య వాక్యాలనూ గుప్పించారు. స్థూలంగా వారి ప్రశ్నోత్తరాల పట్టిక ఇది.కాస్త పరిశీలనగా చూడండి :

డి.సిద్దీక్ వేదన                                        (గీటురాయి 11.5.2012)
షఫీ అహ్మద్ అనునయ వాదన                        (గీటురాయి 5.6.2012 )
దూదేకుసాయిబులూ ముస్లిములే అయినా ముస్లిములు  వారిని పరాయివారిగా చూస్తున్నారు , చైతన్యవంతుల్ని చేయలేకపోయారు.
వివక్షకు ఇస్లాంలో తావు లేదు.కానీ ఈ  జాడ్యం ముస్లిముల్లో క్రమక్రమంగా పాతు కుపోయింది.ఇస్లాం పై పూర్తి అవగాహన లేని కొంతమంది ఇంకా తమ పురిటి కంపును వీడలేదు.అలాంటి వారి దుందుడుకు చేష్టలను,సంకుచితత్వాన్నీ ముస్లిములు అందరికీ ఆపాదించకూడదు.బేధ భావాలు అంతరాలు లేని సర్వమానవ సమతా ధర్మమే ఇస్లాం.
దూదేకుల వారు అటు ముస్లిములుగా కాక ఇటు హిందువులుగా కాక మధ్యలో దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ఆధ్యాత్మికంగా ఎదిగిరాకుండా వీళ్ళను అడ్డుకున్న ముస్లింలు రేపు అల్లాహ్ కు ఏమని సమాధానం చెప్పుకుంటారు?
బాధిత జనావళినీ వారి బాషనూ గేలి చేయటం,అవహేళన చేయటం క్షమించరాని  నేరం.భక్తి ప్రపత్తులే కొలమానం కానీ భాష కాదు. నీగ్రో బానిస హజ్రత్ బిలాల్ కంటే అరబ్ అగ్రవర్ణాలవారు ఏమీ గొప్పవారు కాదు అని ప్రవక్త నిరూపించారు.పేరుకు ముస్లిం అయితే ప్రయోజనం లేదు.ఆచరణలో సమతా ధర్మం చూపాలి.
దూదేకుల సాయిబులు బి.సి.-బి లో కాకుండా బి.సి.-ఈ గా ముస్లిం రిజర్వేషన్ లోకి వస్తే ముస్లిములు అనే సాంఘీక గౌరవం దక్కుతుంది.
తాము సామాజిక రక్షణ పొందినప్పటికీ తమక్రింది వారికి సమాన స్థాయిని కల్పించే విషయమై సంకుచితంగానే వ్యవహరించరాదు.నిమ్నోన్నతాలకూ అంతరాలకూ ఇస్లాంలో ఇసుమంత స్థానం లేదు.
దూదేకులవారిలో ఇస్లాం పట్ల అలసత్వం ఉంది  కాని ఇస్లాం ధర్మానికి దూరంగా ఉంచిన పాపంలో ప్రధాన భాగం ముస్లిములదే.వారు పరధర్మంవైపు పరుగులు తీస్తున్నారు.ఇప్పటికైనా వారిని మీలో కలుపుకోండి.
ఎవరో చిన్న చూపు చూస్తున్నారని నొచ్చుకుంటూ తరచూ బాధపడుతుంటే ఒరిగేది ఏమీ ఉండదు.ఇస్లాం స్ఫూర్తిని అందిపుచ్చుకొని మీరే చైతన్యవంతులు కండి.మనం ఎవరికీ తీసిపోము అనుకొని మీలో ఆత్మస్థైర్యాన్ని నింపుకోండి.క్రుంగుబాటును వీడి ధర్మ పధాన విజయ బావుటా ఎగురవేసి సమసమాజం కల సాకారం చెయ్యండి.




 ‘ఏనాటికైనాను నీదాననే అనే సిద్దీక్ ఆవేదనను షఫీ సరిగానే అర్ధం చేసుకున్నాడు గనుకనే కలసి సాగుదాం ప్రగతి బాటఅన్నాడు.సంతోషం.

సంధర్భంలో నాకు  కూడా నాలుగు మాటలు చెప్పాలనిపించింది. అవీ నా సొంత మాటలు కాదు.దేవుడి మాటలే కాబట్టి ఒకసారి మననం చేసుకుందాం:
*పరస్పరం సంబంధాలు తెంచుకున్న ఇద్దరు సోదరుల నమాజులు వారి తలలపై జానెడు ఎత్తుకు కూడా పోవు. (ఇబ్ను మాజా,మిష్కాత్)
* మేము మా గ్రంధంలో యావత్తు మానవుల మార్గదర్శనం కోసం స్పష్టమైన ఆజ్నలు హితవులూ జారీ చేశాం.వాటిని ప్రజల ముందు వెల్లడించకుండా దాచేవారిని దేవుడు శపిస్తున్నాడు.శపించేవారుకూడా వారిని శపిస్తున్నారు.అయితే జరిగిన దానికి పశ్చాత్తాపం చెంది వ్యవహారశైలిని సరిదిద్దుకొని దాచిన దేవోక్తులను ప్రజలకు వెల్లడించేవారిని నేను క్షమిస్తానుబకరా :159,160
*ముఠా నాయకులు దేశంలో ఎల్లప్పుడూ అలజడులు రేపుతుంటారు.సమాజ సంస్కరణ కోసం ఒక్క మంచిపనీ చెయ్యరు నమల్:48
*దేశంలో ఎలాంటి సంస్కరణ సంక్షేమ కార్యక్రమాలూ చేపట్టకుండా హద్దులు మీరి  అలజడులు రేకెత్తిస్తూ తిరిగేవారికి విదేయత చూపకండి షు రా :152
* నేను మాత్రం నాకు చేతనైనంతవరకు పరిస్తితిని చక్కదిద్దాలని భావిస్తున్నాను హూద్:88
*ఇస్మాయిల్,ఇద్రీస్,జుల్ కిఫ్,జకరియ్యా,...వీళ్ళంతా అమితోత్సాహంతో సత్కార్యాలు చేస్తూండే వారు   
                                                                                              అంబియా: 89 
* ముస్లిముల్లో సమానత్వం సోదరభావం ఎంత పటిష్టంగా ఉంటుందంటే ఇందులోకి అసమానతల జాడ్యం ప్రవేశించే అవకాశమే లేదు.ఒకవేళ ప్రవేశించినా ఆ జాడ్యం ఇక్కడ బతకడం కష్టం
                                                    (‘సత్య ధర్మంలో సమతా భావం పుస్తకం 119పేజీ)
  • ముస్లిమేతరులకు నాస్తికులకూ  పుట్టినా పసి పాపలు అందరూ ముస్లిములే (ఇస్లాం మరియు ముస్లింపుస్తకం  11పేజీ )
  • మేము మిమ్మల్ని మధ్యస్థ సమాజం (ఉమ్మతే వసత్ ) గా చేసాము బఖరా :143
  • ఉమ్మతే వసత్ అంటే ఉన్నతమైన,శ్రేష్టమైన వర్గం.అది న్యాయం,సమభావం,మధ్యేమార్గ వైఖరిపై స్థిరమై ఉంటుంది.అది ప్రపంచ జాతుల మధ్య నాయకత్వపు స్థాయిలో ఉంటుంది.ప్రవక్త ప్రతినిధులుగా వీరు రేపు దేవుని ఎదుట నిలబడి ప్రవక్త చెప్పిన విషయాలన్నీ సామాన్య ప్రజలకు చేరవేశామనీ, చేసి చూపామనీ, ఎలాంటి కొరతా చూపలేదనీ సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది.ఈ సముదాయంలోని మనుషుల మాటలు,చేతలు,ప్రవర్తనను చూసే ప్రపంచం ఒక్కొక్కటీ తెలుసుకోవాలి.దైవ భక్తి అని దేన్నంటారో,రుజువర్తనమంటే ఏదో,దేన్ని న్యాయమని అంటారో,ధర్మం సత్యం అంటే ఎలా ఉంటాయో ప్రపంచం వారి ద్వారానే నేర్చుకోవాలి.... ముస్లిములు ఎంతో ఘోరంగా పట్టుబడతారు.ఈ నాయకత్వపు గర్వం ముస్లిములను అక్కడ నిలువునా ముంచి వేస్తుంది.ముస్లిముల నాయకత్వపు కాలంలో వారిచేత వాస్తవంగా జరిగిన తప్పిదాల వల్ల ఎన్నెన్ని దుర్మార్గాలు ప్రపంచంలో వ్యాపించాయో,ఎన్నెన్ని కలతలు ,కల్లోలాలు ,ఉపద్రవాలు దేవుని భూమిపై సంభవించాయో,వాటన్నిటి కారణంగా ఇతర దుష్టాగ్రేసరులు,మానవులు,   జిన్నుల్లోని షైతానులతో పాటు ముస్లిములూ పట్టుబడతారు.ప్రపంచంలో పాపం,దౌర్జన్యం,దుర్మార్గం,తుఫానులా స్వైరవిహారం చేస్తూ ఉన్నప్పుడు  మీరెక్కడ చచ్చారు? అని ముస్లిముల్ని నిలదీయడం ఖాయం (ఖురాన్ అవగాహనం, బఖరా :143 కి వ్యాఖ్యానం )
  • విశ్వాసులారా ఇకనుండి ప్రపంచ మానవులకు మార్గదర్శనం చేస్తూ వారిని సంస్కరించడానికి రంగంలోకి తీసుకురాబడిన శ్రేష్ట సమాజం మీరే.మీరు మంచి పనులు చేయమని ప్రజలను ఆదేశిస్తారు.చెడులనుండి వారిస్తారు అలీ ఇమ్రాన్ :104,110
  • ధర్మ సంస్థాపనా బాధ్యత నిర్వహించవలసిన ముస్లిం సమాజం కూడా చెడులలో కూరుకుపోయింది.ఇలాంటి పరిస్థితుల్లో ధార్మిక సామాజిక స్పృహ కలిగిన ముస్లిములు చెడును త్రుంచి మంచిని పెంచే బాధ్యత తీసుకోకపోతే సమాజ పతనానికి దేవుని సమక్షంలో ప్రధాన బాధ్యులు వారే అవుతారు(ఖురాన్ భావామృతం , అలీ ఇమ్రాన్ :110 కి వ్యాఖ్యానం)                                  (గీటురాయి 13.7.2012 )
  • The Hindu October 4, 2013 http://www.thehindu.com/news/cities/Hyderabad/facing-the-worst-of-both-worlds/article3803785.ece

    Less fortunate Muslims engaged in ‘unclean’ jobs fare low culturally and constitutionally

    They are slighted and have been kept at arm’s length for centuries, with their community’s name used as an invective in offensive contexts. Islam with its egalitarian principles has not helped them, as they are still seen as pariahs engaged in a menial job.
    Known variously as Dudekula, Noorbash, Laddaf and Pinjari across the State, these less fortunate Muslims face the ‘worst of both the worlds’ - culturally as well as constitutionally. They are one among those engaged in ‘unclean’ occupations among Muslims of Andhra Pradesh, as listed in the Rajinder Sachar Committee Report on Social, Economic, and Educational status of Muslim community in India.
    Elders would remember the Dudekula members as those engaged in the occupation of ‘cotton cleaning’, which is the thrashing out of the crude cotton to separate the seeds and impurities, so that it can be stuffed into mattresses. Mohd. Haneef from old city is a quintessential example from the era.
    Working on a 300-year-old ‘Mutiya’ inherited from forefathers, this 78-year-old ekes out a living by making new pillows out of the old. With a hand-to-mouth existence, and unable to afford education, he brought both his sons into the profession which is fast losing its relevance.
    Nowadays, those from the ‘Dudekula’ community can be found in various other jobs too, ranging from driving auto-rickshaws, tailoring, industrial production, to even working as waged labourers. However, the stigma associated with the caste still remains. “Our notional equality with the elite Muslims ends once we are out of mosque. We are slighted by them and there is no question of inter-marrying,” says Shaikh Tasleem, who runs a mattress-making workshop at Habsiguda.
    His is one among the 100 to 150 Dudekula families that is still engaged in traditional ‘bed works’ in the city. With coir and foam mattresses claiming the sheen away from cotton beds, what sustains them is merely the demand from hospitals and hostels. “Very few people from our community have been educated beyond primary school, which is why we can’t aim for better jobs. However, nowadays, many parents are keen on educating their children,” says Mr. Tasleem.
    This means that many first generation graduates from the community will soon be out. It lends urgency to the long-pending demand for Scheduled Caste status for the community, and the ensuing quotas in education and jobs.
    “As of now, Dudekula is one among the 40 to 45 Dalit castes among Muslims, which have been categorised under Other Backward Classes. All these castes are unable to compete with dominant OBCs either in education or employment. We have been demanding SC status for over 20 years, but to no avail,” Shaikh Sattar Saheb, president of the State Noorbash/Dudekula Muslim Minority Welfare Association says.
    Fakir, Garadi, Hajjam, Mehtar, Pamula, and Athar are some of the other deprived castes among Muslims that he names. He claims that together they constitute over 70 per cent of the total Mulsim population in the State. Despite forming a sizeable portion, political representation from these sections has remained wanting.
    “Our Dalit counterparts from SC and ST sections have achieved sizeable political representation due to reservations. Despite Justice Ranganath Mishra’s recommendations for quotas to Dalit Christians and Muslims, the government has not acted upon it,” says Mr. Sattar.

అబు దావూద్ లో ప్రార్ధన గురించి కొన్ని వాక్యాలు


అబు దావూద్ లో ప్రార్ధన గురించి కొన్ని వాక్యాలు

1.సఫ్వాన్ ఇబ్న్ అల్ ముత్తల్  భార్య ప్రవక్త దగ్గరకొచ్చి  నేను ప్రార్ధన చేసేటప్పుడు నా భర్త నన్ను కొడుతున్నాడు ఉపవాసం చెయ్యొద్దంటాడు,పొద్దు పొడిచేదాకా నిద్ర లేవడు అని ఫిర్యాదు చేసింది.అందుకు  సఫ్వాన్ ఆమె రెండు సూరాల దీర్ఘ ప్రార్ధన చేస్తుంది అంటాడు. ఒకసూరా చాలు అంటాడు ప్రవక్త.ఆమె చాలా ఎక్కువసేపు ఉపవాసం చేస్తుంది.నేను కుర్రవాడిని ఉండలేకపోతున్నాను అంటాడు సఫ్వాన్.భర్త అనుమతి లేకుండా భార్యలు ఉపవాసం చేయొద్దు అంటాడు ప్రవక్త. మేము నీళ్ళు సరఫరా చేస్తాము.మా తెగలో వాళ్ళంతా పొద్దు పొడిచాకే నిద్ర లేస్తారు అంటాడు సఫ్వాన్.అయితే నిద్ర లేవగానే ప్రార్ధన చెయ్యండి  అంటాడు ప్రవక్త.  (అబు దావూద్ 1016) 
  
2.భక్తుడైనా భక్తిహీనుడైనా ఘోర పాపాలు చేసినవాడైనా సరే ప్రార్ధన చెయ్యాల్సిందే.(అబు దావూద్ 1052) 

3.అమ్ర్ ఇబ్న్ ఉఖైష్ అనే వడ్డీ వ్యాపారి జీవితంలో ఎన్నడూ ప్రార్ధన చేయలేదు. అల్లాపై విశ్వాసం తో  ఉహద్ యుద్ధంలో పాల్గొన్నందువల్ల  పరలోకంలో ప్రవేశిస్తాడు. (అబు దావూద్ 1056)

4.యుద్ధంలో,వర్షంలో చేసే ప్రార్ధన తిరస్కరించబడదు (అబు దావూద్ 1058)

5.మీరు మసీదును చూసినప్పుడు ప్రార్ధనా పిలుపు విన్నప్పుడు ఎవరినీ చంపకండి.(అబు దావూద్1112)
 
6. ఒక వ్యక్తి నాకు ఖైబర్ కొల్ల ధనం చాలా  దొరికింది అని సంబరపడిపోతుంటాడు.రెండు రకాతుల అదనపు ప్రార్ధన చేసిన వాడికే  నీకంటే ఎక్కువ ధనం దొరికింది అంటాడు ప్రవక్త.(అబు దావూద్1197)

7.ప్రార్ధనా స్థలం లోనే ప్రవక్త పొట్టేలును తన స్వహస్తాలతో కోసి బలి ఇస్తూ బలి అర్పించని నా మిగతా జనం కోసం బలి ఇస్తున్నానుఅంటాడు.(అబు దావూద్1213)

8.మసీదులో ఉంటే మనసులు మృదువుగా అవుతాయి.మోకరించే ప్రార్ధన లేని మతం లో ఏ మంచీ లేదు. ప్రార్ధన కపటస్తులకు భారంగా ఉంటుంది.ప్రార్ధనలోని మేళ్ళు మీకు తెలిస్తే మోకాళ్లతో పాకుకుంటూ కూడా వస్తారు.ప్రార్ధనలోని ముందు వరుస దేవదూతలవరుస లాంటిది.(అబు దావూద్1318,218)

9.ఉహద్ యుద్ధంలో చనిపోయిన అమర వీరుల రక్త దేహాలను కడగకుండా ప్రార్ధన చెయ్యకుండానే పూడ్చిపెట్టారు. (అబు దావూద్1377)

10.మీరు ఇక్కడ ప్రార్ధన చేస్తే ఎరూషలేములో చేసినట్లే.ఇబ్రాహీం స్థానాన్నే మీ ప్రార్ధనా స్థలం గా చేసుకోండి.ప్రజల్ని చూడటానికి వచ్చిన వ్యక్తి ప్రార్ధన నడిపించ కూడదు.ఆ ప్రాంతంలోని సొంత మనుషులే ప్రార్ధన నడిపించాలి.సామూహిక ప్రార్ధనలో పాల్గొంటే ఇహ్రామ్ ధరించి హజ్ యాత్ర,ఉమ్రా  చేసినంత పుణ్యం (అబు దావూద్1462,1817,236,220)

11.అప్పులు తీర్చకుండా చనిపోయిన వారి మృత దేహాలకు నేను ప్రార్ధన చేయను.నేను విశ్వాసికి తన కంటే ఎక్కువ దగ్గరగా ఉన్నాను.అప్పు తీర్చకుండా అతను చనిపోతే ఆ బాధ్యత నాపైన పడుతుంది (అబు దావూద్ 1482)

12.సారాయి తాగేవాడు ప్రార్ధనకు రాకూడదు.ప్రతి మత్తు పదార్దమూ నిషిద్ధమే.మత్తుడి ప్రార్ధనను అల్లా అంగీకరించడు.(అబు దావూద్ 1650,1656)

13.అన్నం తినటం కోసం గానీ మరి దేనిగురించిగానీ  ప్రార్ధనను వాయిదా వేయకూడదు (అబు దావూద్ 1692)

14.ప్రార్ధనాపరుని దృష్టిని మళ్ళించే వస్తువేదీ ఎదురుగా ఉండకూడదు.దృష్టిని ఆకర్షించే ఆడంబర వస్త్రం బదులు ఎలాంటి గుర్తులూ లేని సాదారణ ముతక బట్టనే ప్రార్ధన లో పరుచుకోండి (అబు దావూద్ 825,1868) 

15.అత్తరు సువాసనల గుబాళింపుతో మసీదులో చేసే స్త్రీ ప్రార్ధన ఆమె తిరిగి స్నానం చేసే దాకా అంగీకరించబడదు.అసలు అలాంటి వాసనలు పూసుకొన్న స్త్రీలు మాతో కలిసి రాత్రి ప్రార్ధనకు రావద్దు.మసీదులో లాంటి ఘాటు వాసనలు రేపే పురుషుడి ప్రార్ధన కూడా అల్లా ఆలకించడు (అబు దావూద్ 1940,1941,1944)

16.అత్యాచారానికి గురైన ప్రార్ధనాపరురాలిని అల్లా క్షమించాడు (అబు దావూద్ 2057) 

17.ప్రార్ధన తరువాత ప్రవక్త కన్నీళ్ళు కారుస్తూ శ్రోతల హృదయాలు కరిగేలా హితబోధ చేసేవారు (అబు దావూద్ 2186) 

18.గుహలలో బందీలై  ఏకాంత తపస్సు (మోనాస్టరీ ప్రార్ధనలు) చేయవద్దు.అలా కొత్తగా కనుక్కున్న  వాటిల్లో తప్పులుంటాయి. ఒంటరి జంతువుపైనే తోడేలు దాడి చేస్తుంది. ఇళ్ళల్లో ప్రార్ధించినా మసీదుకొచ్చినప్పుడు అందరితో కలిసి సామూహికంగా ప్రార్ధించండి. (అబు దావూద్ 214,228)  

19.ప్రజలను సరి చెయ్యటం ప్రార్ధన కంటే ,దాన ధర్మాలకంటే ,ఉపవాసం కంటే ఉత్తమమైనది (అబు దావూద్ 2310)

20.ఓ అల్లా నన్ను నరకం నుంచి రక్షించు నే మాటతో  నీవు ఉదయం,సాయంత్రం వేళల్లో ఏడు సార్లు ప్రార్ధిస్తే దేవుడు నీ చిట్టాలో  నీకు రేయి పగలు రక్షణ రాస్తాడు. (అబు దావూద్ 2410)

21.కోడి పుంజును తిట్టొద్దు.అది మిమ్మల్ని ప్రార్ధనకోసమే లేపుతుంది (అబు దావూద్ 2416)

22.ఫాతిమా సన్ గారిని కనగానే హాసన్ చెవి లో ప్రవక్త ప్రార్ధనా పిలుపు (అజాన్ ) వినిపించారు. (అబు దావూద్ 2419)

23.ప్రవక్త పలికిన చివరి పలుకులు: ప్రార్ధన చెయ్యండి ,ప్రార్ధన చెయ్యండి.మీ భార్యబిడ్డలను దేవునికి భయపడి జాగ్రత్తగా చూసుకోండి   (అబు దావూద్ 2447)

24.ప్రశాంతంగా మీ ప్రభువును ప్రార్ధించండి.పక్క వారికి ఇబ్బంది కలిగించేలా ఒకరిని మించిన పెద్ద గొంతుతో మరొకరు అరిచి ప్రార్ధించవద్దు.ఉమర్ పెద్ద గొంతుతో ప్రార్ధన చేయటం అల్లా అనుమతించలేదంటూ ప్రవక్త అబూబకర్ తో ప్రార్ధన చేయిస్తారు  (అబు దావూద్ 2447,2195)

25.ప్రవక్త పండుగ ప్రార్ధన,ప్రసంగం ముగించి ప్రసంగా వేదిక దిగి బిలాల్ చేతి ఊతంతో ఆడవాళ్ళ దగ్గరకొచ్చారు.బిలాల్ ఒక గుడ్డ పరచి పట్టుకుంటే స్త్రీలు అందులో తమ ఉంగరాలు ఇతర ఆభరణాలు కానుకలుగా వేశారు.స్త్రీలు ఒక వరుసలో ,పురుషులు మరో వరుసలో ప్రార్ధనకు నిలబడేవారు.పురుషులు తస్బీహ్ చెబితే ,స్త్రీలు చప్పట్లు కొట్టేవారు (అబు దావూద్363,439,440,891) 

26.సామూకంగా ప్రార్ధించండి.ఒంటరి జంతువుపైనే తోడేలు దాడి చేస్తుంది.సామూహిక ప్రార్ధన చేస్తే 25 అడివిలో ప్రార్ధన చేస్తే 50  ప్రార్ధనల ప్రతిఫలం,పాపాల క్షమాపణ దొరుకుతుంది.ప్రార్ధనకోసం పిలిచే వానికి అతని స్వరం వినబడినంత వరకు క్షమాపణ దొరుకుతుంది. (అబు దావూద్214,203,221 )
 
27.శుక్రవార సూర్యోదయం అత్యుత్తమమైనది.శుక్రవారం నాడే : దేవుడు ఆదామును చేశాడు.ఆదామును పరలోకం నుండి వెళ్ళగొట్టాడు .ఆదామును క్షమించాడు.ఆదాము చనిపోయాడు.చివరి ఘడియ వస్తుంది. మనిషి ,జీన్నులు తప్ప ప్రతి జంతువు చివరి ఘడియకోసం ఆరోజునే భయంతో ఎదురు చూస్తాయి.ముస్లిములు ప్రార్ధించే సమయంలో మాత్రం రాదు.శుక్రవార చివరి ఘడియల్లోనే అంతిమ ఘడియ వస్తుంది.సరైన కారణం లేకుండా సామూహిక ప్రార్ధన ఎగ్గొట్టి ఒంటరిగా చేసుకునే ప్రార్ధన అంగీకరించబడదు (అబు దావూద్ 400,215)

28.భూమి దేవుని ప్రార్ధనా స్థలం (మసీదు) మనిషిని శుద్ధిచేసే స్థలం. (అబు దావూద్ 192 )

29.చివరి ఘడియ సూచనల్లో ఒకటి: మసీదులో భక్తులు ఇమాము చెప్పినట్లు చెయ్యరు.అసలు ప్రార్ధన చేయించటానికి ఇమామే దొరకడు. (అబు దావూద్ 232)

30.యూదులు చెప్పులు లేకుండా ప్రార్ధన చేస్తారు.మీరు మసీదులో చెప్పులు తొడుక్కోనే  ప్రార్ధన చెయ్యండి.కానీ వాటిని శుభ్రం చేయండి. (అబు దావూద్ 256)